
నేడు ఆయిల్ ఫామ్ సాగుపై రైతు సదస్సు
– మరి కాసేపట్లో నిర్వహణ ఏర్పాట్లు
– ప్రకటించిన ఉద్యావన శాఖ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేడు తాండూరు పట్టణంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఉద్యావన, పట్టు పరిశ్రమ, ఏకో అయిల్ ఫామ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. తాండూరు పట్టణం బాలాజీ మందిర్లో శుక్రవారం ఉదయం 11-30గంలకు సదస్సు ప్రారంభమవతుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ సత్తార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో ఆయిల్ ఫామ్ సాగు వల్ల వచ్చే లాభాలు, రైతుల కోసం తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. కావున రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని అధికారి ఎంఏ సత్తార్ కోరారు.

ఇదికూడా చదవండి…

