రేపు తాండూరుకు పైలెట్ రాక..!
– పలు కార్యక్రమాలకు హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రేపు తాండూరుకు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆయన తాండూరుకు రాలేదు. పార్టీ వ్యవహారాలను స్థానిక పెద్దలకు అప్పగించారు. మూడు రోజుల క్రితమే రోహిత్ రెడ్డి తాండూరుకు రావాల్సి ఉంది. కొన్ని కారాణాల వల్ల రాలేకపోయారు. తాజాగా శుక్రవారం ఆయన తాండూరుకు వస్తున్నారు. పట్టణంలో పలు కార్యక్రమాలో పాల్గొంటారని, అనంతరం పార్టీ నేతలతో చర్చిస్తారని తెలిపారు. కావున నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

