శభాష్.. నిఖిత..!
– బాక్సింగ్లో గోల్డ్ మెడల్
– పెద్దేముల్ మండల యువతీ ఘనత
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన గిరిజన నిఖిత శభాష్ అనిపించుకుంది. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. దాసడి విజయ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లాలాపేట్ లోగల ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11,12వ తేదీలలో 7వ యూత్ అండర్ 19 పురుషుల, మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి.

అండర్19 మహిళల కేటగిరి 45,48 కేజీల విభాగంలో పెద్దేముల్ మండలం మన్సాన్ పల్లికి చెందిన మూడావత్ నిఖిత గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా యువతీ తల్లిదండ్రులు దేవి బాయి విటల్ నాయక్ లతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నార్సింగి లోని గిరిజన గురుకులంలో విద్యాభ్యాసం కొనసాగిస్తుంది.
ఇది కూడా చదవండి….

