ఘనంగా అవినాష్ రెడ్డి జన్మదినం
– భద్రేశ్వర దేవాయలంలో అన్నదానం
– పటేల్ కిరణ్ కుమార్ సహాకారంతో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిన్న కుమారుడు బుయ్యని అవినాష్ రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు.

మంగళవారం తాండూరు పట్టణం భ్రదేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినాష్ రెడ్డి జన్మదినం సందర్బంగా దేవాలయ ప్రాంగణంలోని దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, యువదళ్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

