నూనే, సబ్బులు ఇవ్వరా…!
– ఆఫీసులో మూలుగుతున్న వస్తువులు
– పంపిణీ కోసం ఎదురుచూస్తున్న కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. చెత్త తొలగింపు, మురుగు కాలువల పరిశుభ్రం పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యం కోసం వస్తులను పంపిణీ చేస్తుంది. నూనె, సబ్బులు అందజేస్తారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పంపిణీలో తాత్సారం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్మికుల కోసం మంజూరు చేసిన నూనె, సబ్బులను పంపిణీ చేయకుండా కార్యాలయంలోని ఓ గదిలో అలాగే ఉంచారు. చాలా రోజులుగా అలాగే వదిలేయడంతో ఉన్న చోటే మగ్గిపోతున్నాయి. గతంలో కూడా వస్తువులు పంపిణీ చేయకుండా వదిలేయడంతో పాడైపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నూనే, సబ్బులు ఎప్పుడు పంపిణీ చేస్తారో అని కార్మికులు ఎదురుచూస్తున్నారు.
ఇదికూడా చదవండి…

